ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును ఈనెల 27న బాలీవుడ్ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ అందుకోనున్నారు
ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును ఈనెల 27న బాలీవుడ్ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ అందుకోనున్నారు. ఈ పురస్కారం కింది రూ.5 లక్షల నగదుతో పాటు ప్రశంసాపత్రంతో సత్కరించనున్నారు.
2005 వ సంవత్సరం నుండి భారతీయ సినిమా రంగంలో విశిష్ట సేవలు అందించిన వారికి అక్కినేని అవార్డును ఇస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
గతంలో ఈ అవార్డును
దేవానంద్, షబానా అజ్మి, అంజలి దేవి, లతా మంగేష్కర్, వైజయంతి మాలా, బాలచందర్, హేమమాలిని, శ్యాం బెనగల్ తదితరులు అందుకున్నారు.