హైదరాబాద్ శివారులోని హరికృష్ణ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు.. జానకిరామ్కు కన్నీటి వీడ్కోలు…..
కన్నుమూసిన నందమూరి జానకిరామ్ కడసారి చూపుకోసం సినీ, రాజకీయ, వ్యాపార వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు, నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆదివారం పెద్ద సంఖ్యలో నందమూరి హరికృష్ణ ఇంటికి భారీ సంఖ్యలో తరలి వచ్చారు. మృతిచెందిన కుమారుడి పార్థివ దేహం వద్ద రోదిస్తున్న హరికృష్ణను చూసి చాలా మంది కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. సోదరులు కల్యాణ్రామ్, ఎన్టీఆర్ కూడా అన్నకు శ్రద్ధాంజలి ఘటిస్తూ విలపించారు.
చితికి నిప్పంటించిన పెద్ద కుమారుడు తారక రామారావు శోకసంద్రంలో నందమూరి కుటుంబం..
నందమూరి జానకిరామ్కు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు అశ్రునయనాలతో ఆదివారం తుది వీడ్కోలు పలికారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని ముర్తుజాగూడ సమీపంలో ఉన్న హరికృష్ణ వ్యవసాయ క్షేత్రంలో జానకిరామ్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.