విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఐ’ చిత్రం పై హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం…
విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఐ’ చిత్రం పై హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం…
విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఐ’ చిత్రం లో ఓస్మా అనే మేకప్ ఆర్టిస్ట్ పాత్ర హిజ్రాలను ఆగ్రహానికి గురి చేసింది. ఈ పాత్రను ఓజాస్ రజనీ చేసింది. ఇది ట్రాన్స్ జెండర్ కారెక్టర్. ఈ పాత్రను ఉద్దేశించి విక్రమ్, సంతానం మాట్లాడిన సంభాషణలు అభ్యంతరకరంగా ఉన్నాయని హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో తమిళనాడులోని పలు థియేటర్ల దగ్గర హిజ్రాలు ధర్నా చేశారు. ఆ తర్వాత దర్శకుడు శంకర్ ఇంటి ముందు కూడా ధర్నా చేశారు. తమను కించపరిచే విధంగా ఉన్న సన్నివేశాలను తీసేయకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ గొడవ ముదిరి పాకాన పడే పరిస్థితి కనిపిస్తుండటంతో శంకర్ ఇంటికి పోలీస్ రక్షణ ఏర్పాటు చేశారు. ఈ వివాదం గురించి ఇప్పటివరకూ శంకర్ నోరు విప్పలేదు.