విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సినీతారలు క్రికెట్ ..మ్యాచ్ ద్వారా వచ్చిన 70 లక్షల రూపాయల మొత్తాన్నిముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు…
ఆదివారం ఉదయం నుంచీ స్టేడియంలో హుదూద్ తుపాను బాధితుల సహాయార్థంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సినీతారలు క్రికెట్ నిర్వహించారు. స్టేడియంలో హీరోలు, హీరోయిన్లను చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ మైదానంలో క్రికెట్తో సరదాగా గడిపేసిన సినీతారలు -మ్యాచ్ ద్వారా వచ్చిన 70 లక్షల రూపాయల మొత్తాన్ని చెక్కు రూపంలో ఎమ్మెల్యే బొండా మహేశ్వర రావు ద్వారా సిఎం సహాయ నిధికి శ్రీకాంత్, తరుణ్, జగపతిబాబు తదితరులు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు.