దేశంలోని యువత మాదక ద్రవ్యాలకు బానిస కావడంపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు
దేశంలోని యువత మాదక ద్రవ్యాలకు బానిస కావడంపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. అకాశవాణి ద్వారా ‘మనసులోని మాట’ (మన్ కీ బాత్) శీర్షిక కింద మూడోసారి దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు బానిస కావటంవల్ల వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లిదండ్రులు చెప్పలేనంతగా బాధ పడుతున్నారని చెప్పారు. ఈ సమస్య పరిష్కారానికి జాతీయ స్థాయిలో ఓ హెల్ప్ లైన్ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని ప్రధాన మంత్రి ప్రకటించారు. మాదక ద్రవ్యాల విక్రయంవల్ల వచ్చే డబ్బుతోనే తీవ్రవాదం పెరుగుతోందని, యువత మాదవ ద్రవ్యాలను కొనుగోలు చేసేందుకు వెచ్చిస్తున్న డబ్బు చివరకు తీవ్రవాదులకు అందుతోందని, తీవ్రవాదులు ఈ డబ్బుతోనే ఆయుధాలు కొనుగోలు చేసి దాడులకు దిగుతున్నారని, మన భద్రతా దళాలను హతమార్చేందుకు కుట్రలు చేస్తున్నారని మోదీ హెచ్చరించారు.