చెక్‑బౌన్సు కేసులో సినీనటి జీవితకు రూ. 25 లక్షల జరిమానా, రెండేళ్ల జైలుశిక్ష
చెక్‑బౌన్సు కేసులో సినీనటి జీవితకు రూ. 25 లక్షల జరిమానా, రెండేళ్ల జైలుశిక్ష.
2007లో ఎవడైతే నాకేంటి అనే సినిమా నిర్మించారు. సామ శేఖర్‑రెడ్డి వద్ద రుణం తీసుకున్నారు. సినిమా రైట్స్ కూడా ఇస్తామని చెప్పారు. అయితే, ఏడేళ్లయినా తనకు డబ్బులు ఇవ్వలేదని, 2014 జనవరిలో ఎర్రమంజిల్ కోర్టులో తాను చెక్ బౌన్స్ కేసు దాఖలు చేసినట్లు సామ శేఖర్‑రెడ్డి తెలిపారు. కేసు విచారించిన ఎర్రమంజిల్ కోర్టు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి జీవితకు రూ. 25 లక్షల జరిమానా, రెండేళ్ల జైలుశిక్ష విధించింది.