హాస్పటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అవ్వగానే నేనే వ్యక్తిగతంగా కలుస్తా -పవన్ కళ్యాణ్

 

హాస్పటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అవ్వగానే నేనే వ్యక్తిగతంగా కలుస్తా -పవన్ కళ్యాణ్

‘గోపాల గోపాల’ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ టికెట్ల కోసం గొడవపడి పవన్ కల్యాన్ అభిమాని కొందరు దుండగులు కరుణ శ్రీనివాస్‌పై దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు…దాడి జరుగుతున్నప్పుడు పవన్ కల్యాణ్ అభిమానులు సెల్‌ఫోన్‌లో తీసిన ఫొటోలను సేకరించారు.

గోపాల గోపాల’  సినిమా ఆడియో  కార్యక్రమం సందర్భంగా  శిల్పకళా వేదిక ఆవరణలో ఆదివారం జరిగిన సంఘటనపై హీరో పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో  స్పందించాడు. గుంటూరుకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని శ్రీనివాస్పై  కొందరు యువకులు దాడి చేసి గొంతు కోసిన విషయం తెలిసిందే.

పవన్ దీనిపై స్పందిస్తూ  ‘నిన్న జరిగిన ఘటన చాలా దురదృష్టకరం.ఈ వార్త వినగానే నా మనసు చాలా కలచి వేసింది. అతను హాస్పటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అవ్వగానే నేనే వ్యక్తిగతంగా కలుస్తా. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి’ అని ట్విట్ చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *