రైతులు సాగునీటిని పొదుపు వినియోగించుకోవాలని కమిషనర్‌ విజ్ఞప్తి ….

స్వల్ప కాలిక పంటలు సాగు చేయాలని , రైతులు సాగునీటిని పొదుపు వినియోగించుకోవాలని కాడ్‌ కమిషనర్‌ కాడ్మియల్‌ దాసరి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నీటి వినియోగం, పంటల సాగు, తదితర విషయాలపై రైతులకు అవగాహన కల్పించారు. గురువారం కమిషనర్‌తో పాటు ఎస్‌ఈ రాజేశ్వరరావు, ఈఈ శ్రీనివాసులు గాజులదిన్నె ప్రాజెక్టును పరిశీలించారు.