ప్రపంచంలో క్రీడాకారులకు మంచి గుర్తింపు ఉందని, చదువుతో పాటు క్రీడల్లో కూడా పాల్గొనాలని కర్నూలు ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు.
గురువారం కర్నూలు డీఎస్ఏ ఔట్డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్ గ్రామీణ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.