నటుడు కోట శ్రీనివాసరావుకు సన్మానం…..
నటుడు కోట శ్రీనివాసరావుకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సందర్భంగా హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ తదితరులు సన్మానించారు. త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న కొత్త చిత్రంలో కోట…నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో కోటకు చిత్ర యూనిట్ సభ్యులు శాలువాకప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన చేత కేక్ కట్ చేయించారు. నటుడు రాజేంద్రప్రసాద్, హీరో ఉపేంద్ర, హీరోయిన్ స్నేహ పలువురు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.