‘స్వచ్ఛ భారత్ని నిర్మిస్తామం’టూ ప్రధాని మోదీ ప్రతిజ్ఞ
‘స్వచ్ఛ భారత్ని నిర్మిస్తామం’టూ ప్రధాని మోదీ ప్రతిజ్ఞ చేసే రాజ్పథ్ రహదారిని ఇప్పటికే అద్దంలా తీర్చిదిద్దారు. గురువారం దేశవ్యాప్తంగా 30 లక్షల మంది ప్రభుత్వ సిబ్బంది చీపుర్లు పట్టుకొని..ప్రతిజ్ఞ తీసుకోనున్నారు. శుద్ధి కోసం పరిశ్రమ! ఆరోగ్య భారతం కోసం పరిక్రమ! దారుల్లో, మనోవీధుల్లోని దుమ్ముని దులిపేసేందుకు కోట్లాది చేతుల కరసేవ!.. ‘స్వచ్ఛ భారత్ మిషన్’ సందేశాన్ని అందుకునేందుకు దేశం సిద్ధమవుతున్నది. ఇలా ప్రతిచోటా సమష్టి శ్రమ దృశ్యం కనిపిస్తుంది. ప్రధాని మోదీ తానే స్వయంగా ఢిల్లీలోని వాల్మీకి […]