డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద గల ఆయన విగ్రహానికి సినీనటుడు చిరంజీవి నివాళులు అర్పించారు
భారత రాజ్యంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్థంతిని పురస్కరించుకుని ట్యాంక్ బండ్ వద్ద గల ఆయన విగ్రహానికి సినీనటుడు చిరంజీవి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం స్వయంగా చూశానని, కాంగ్రెస్ పార్టీతోనే అది సాధ్యమని భావించిన మీదటే విలీనానికి అంగీకరించానని తెలిపారు. సామాజిక న్యాయం కోసమే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశానని అన్నారు.