ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేజ్రీవాల్ కు ఫోన్……
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ అంచనాలను మించి ఆమ్ ఆద్మీ పార్టీ విజయభేరీ మోగించడం ఖాయమై పోయింది. దీంతో ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీ అభివృద్ధికి సంపూర్ణ మద్దతు, సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం ముందు బీజేపీ వెలవెలబోయింది.