ప్రముఖ దర్శకుడు బాలచందర్ ఇకలేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను – రజనీకాంత్
ప్రముఖ దర్శకుడు బాలచందర్ ఇకలేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను-రజనీకాంత్
రజనీకాంత్తో పాటు కమల్ హాసన్ను వెండి తెరకు పరిచయం చేసింది బాలచందరే.1975లో ‘అపూర్వ రాగంగల్’ చిత్రం ద్వారా రజనీకాంత్ను బాలచందర్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. మొదటి చిత్రం నుంచి చివరి వరకూ వారి మధ్య సాన్నిహిత్యం కొనసాగింది. దాదాపు వీరిద్దరి కాంబినేషన్లో పది చిత్రాలు వచ్చాయి. బాలచందర్ లోటు తనకు వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరంగా కూడా పూడ్చలేని లోటు అని రజనీకాంత్ అన్నారు. ఆయన లేరంటే నమ్మలేకపోతున్నానని, బాలచందర్ తనకు గురువు మాత్రమే కాదని.. ఆయన తండ్రిలాంటి వారని, ఆయన తనను సొంత బిడ్డలా చూసుకునేవారని ఆయన పేర్కొన్నారు.
చెన్నైలోని ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలచందర్ నిన్న మృతిచెందారు. కాగా కుటుంబ సభ్యులు బుధవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.