ప్రధాని మోదీని ‘ఏషియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు వరించింది.

ప్రధాని మోదీని ‘ఏషియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు వరించింది. భారత అభివృద్ధి నాయకత్వం అందించినందుకు ఈ అవార్డు అందిస్తున్నట్లు సింగపూర్‌కు చెందిన ‘ది స్ట్రైట్ టైమ్స్’ దినపత్రిక ప్రకటించింది. ‘మేకిన్ ఇండియా’ పిలుపు దేశాభివృద్ధికి బాటలు వేస్తుందని  పత్రిక సంపాదకుడు చెప్పారు. ప్రధాని పదవికి మోదీ కొత్తయినా, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఆస్ట్రేలియా ప్రధాని ఎబాట్‌లతోపాటు పలువురు నేతలను కలిసి  ఆసియాలో తనదైన ముద్ర వేయగలిగారంది.