కలకండతో స్వైన్ ఫ్లూ లక్షణాలు దగ్గు, జలుబు మటుమాయం…!
ఒకప్పుడు జలుబు, దగ్గు సాధారణం.. ఇప్పుడు అవి ప్రాణాంతకంగా మారాయి. అందుకు కారణం దేశ వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ మహమ్మారి భయాందోళన కలిగిస్తుండడమే. స్వైన్ ఫ్లూ వ్యాధి ప్రధాన లక్షణాలు దగ్గు, జలుబు అని వైద్యులు తెలుపుతున్నారు. జలుబు చేసి ముక్కులు కారుతూ, విపరీతమైన దగ్గు ఉన్నట్లైతే వెంటనే ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూ సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇంతటి భయాన్ని కలిగించే దగ్గు, జలుబును ఇంటి వైద్యంతోనే సరిచేసుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు తెలుపుతున్నారు. అలాంటి చిట్కాలు కొన్ని మీ కోసం..
- కలకండ అనేది ఒక రకమైన బెల్లం. ఇది పచారీ కొట్టులో దొరుకుతుంది. దీనిని తీసుకుని, దీనికి సమానంగా మిరియాల పొడిని కలిపి నూరి కుంకుడు గింజలంత ప్రమాణంలో మాత్రలు చేసుకుని, బుగ్గన పెట్టి చప్పరిస్తుంటే దగ్గు, ఆయాసం క్రమంగా తగ్గిపోతుంది.
- అల్లం రసంలో తేనె కలుపుకుని తాగుతుంటే జలుబు, దగ్గు, ఆయాసం మటుమాయమవుతాయి.
- శొంఠిని నెయ్యిలో వేయించి, కరక్కాయ, తానికాయల్లో గింజలు తీసేసి ఈ మూడింటినీ సమానంగా తీసుకుని బెల్లం కలిపి, మెత్తగా నూరి కుంకుడు గింజలంత మాత్రలుగా చేసుకుని బుగ్గన పెట్టుకుని రసాన్ని గ్రహిస్తుంటే దగ్గు తగ్గిపోతుంది.