రెండు దశల్లో పల్స్ పోలియో చుక్కలు
చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది. జనవరి 18, ఫిబ్రవరి 22న రెండు దశల్లో వేయాలని నిర్ణయించారు. మొదటి దశగా రేపు చుక్కల మందు వేయనుంది. ఇందుకు అవసరమైన చుక్కల మందును ఇప్పటికే సరఫరా చేశారు. సిబ్బంది, అధికారులకు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా 27,142 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 754 మొబైల్ బృందాలను అందుబాటులో ఉంచారు. మొత్తం 2720 రూట్ పర్యవేక్షకులు, 35వేల మంది ఏఎన్ఎంలతోపాటు వీరికి సహాయంగా 33,985మంది అంగన్వాడీ కార్యకర్తల సేవలను వినియోగించుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 44,32,915 మంది పిల్లలకు రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో చుక్కలు వేయనున్నారు.