కిరణ్బేడీని సీఎం అభ్యర్థిగా ప్రకటించే ఛాన్స్!
డిల్లీలో ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో బీజేపీ నేతలు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో సీఎం, అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇటీవలే పార్టీలో చేరిన కిరణ్బేడీని సీఎం అభ్యర్థిగా ప్రకటించే ఛాన్స్ ఉండటంతో ఆమె వ్యతిరేక గళాలు కూడా వినిపిస్తున్నాయి. సీఎం అభ్యర్థి ఎంపికపై పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని బీజేపీ నేత జగదీష్ముఖి అన్నారు. బీజేపీ కుటుంబ పార్టీ కాదు, కేంద్ర నాయకత్వం సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తుందని తెలిపారు.